రజక్ పల్లిలో గ్రామసభ
నిజాంపేట: నేటి ధాత్రి
నిజాంపేట మండలం రజాక్ పల్లి గ్రామంలో శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ వజ్జే కనకరాజు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలపై గ్రామ సభలో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా భవనం ,సీసీ కెమెరాలు, పారిశుద్ధ పనులు గురించి మాట్లాడడం జరిగిందన్నారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని మండలంలోనే మొదటి స్థానానికి తీసుకుపోదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, నూతన పాలకవర్గం సభ్యులు ఉన్నారు.
