బహుళ ప్రజామోదం పొందిన వందేభారత్ రైళ్లు
గత పదేళ్లలో విస్తృతంగా మౌలిక సదుపాయాల వృద్ధి
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1300 స్టేషన్ల పునరభివృద్ధి
98 శాతం బ్రాడ్గేజ్ విద్యుదీకరణ పూర్తి
కశ్మీర్ను దేశంతో అనుసంధానించిన చీనాబ్ వంతెన
రైల్వే స్టేషన్లలో ప్రధానమంత్రి జన ఔషది కేంద్రాలు
డెస్క్,నేటిధాత్రి:
జార్ఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైలు అనుసంధానతను పెంచేందుకు వీలుగా ప్రధానమంత్రి నరేందమ్రోదీ నేతృత్వంలోని ఆర్థికవ్యవహారాల మంత్రిమండలి కమిటి (సీసీఈఏ) రూ.6405 కోట్ల విలువైన రెండు ప్రధాన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు బుధవారం ఆమోదం తెలిపింది. కమిటీ ఆమోదించిన ప్రాజెక్టులు కొడెమా`బర్కాఖానా (133కి.మి)డబ్లింగ్ మరియు బళ్లారి`ఛిగ్జాజూర్ డబ్లింగ్ (185కి.మి).
కొడెమా`బర్కాఖానా డబ్లింగ్:
ఇది పాట్నారాంచీ మధ్య మరింత వేగంగా సమర్థవంతమైన రైల్ లింక్ను ఏర్పరుస్తుంది. ఈ మార్గంలో రద్దీని తగ్గించడమే కాకుండా, సరుకు రవాణాతో పాటు ప్రయాణికుల రైళ్లు ఎటువంటి ఆలస్యం లేకుండా గమ్యాలను చేరుకోవడానికి ఈ లైన్ దోహదం చేస్తుంది.
బళ్లారి`ఛిగ్జాజూర్ డబ్లింగ్
ఈ రైల్వేలైన్ బళ్లారి నుంచి కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్లోని అనంతపు రం జిల్లాల మధ్య అనుసంధానతను పెంచుతుంది. ఈ రెండు ప్రాజెక్టులు రaార్ఖండ్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఏడు జిల్లాలను కవర్ చేస్తాయి. అంతేకాదు భారతీయ రైల్వేలు మరో 318 కిలోమీటర్ల దూరం విస్తరించడమే కాదు, 1408 గ్రామాలకు రైలు కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ మొత్తం గ్రామాల జనాభా 28.19లక్షలు! బగ్గు, ముడి ఇనుము, ఉక్కు, సిమెంట్, రసాయన ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా మరింత శీఘ్రంగా కొనసాగ గలదు. అంతేకాదు ఈ ప్రాజెక్టుల వల్ల ఏటా మరో 49 మిలియన్ టన్నుల సరుకు రవాణా సాధ్యం కాగలదు. ఇదే సమయంలో తక్కువ ఖర్చు, పర్యావరణ హితంగా రవాణా కొనసాగడం ఈ ప్రాజెక్టులో ప్రధానాంశం. ఈ ప్రాజెక్టుల వల్ల 52కోట్ల లీటర్ల డీజిల్ వినియోగం రైల్వేలకు తగ్గడమే కాదు, 264 కోట్ల కిలోల కర్బన ఉద్గారాలను నిరోధించవచ్చు. అంటే ఇది 11కోట్ల మొక్కలను నాటినదానికి సమానం.
తిరుపతి` పాకాలాకాట్పాడి రైల్వేలైన్
104 కిలోమీటర్ల దూరం వుండే ఈ రైల్వే లైన్కు 2025, ఏప్రిల్ 9న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ లైన్ నిర్మాణానికి రూ.1332కోట్లు ఖర్చు కాగలదని అంచనా. అయితే ఇదే నెల 4వ తేదీన కేంద్ర కేబినెట్, రూ.18,658 కోట్ల విలువైన మౌలిక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇవి మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన 15 జిల్లాలను కవర్ చేస్తాయి.
ఈ ప్రాజెక్టులను ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద చేపడుతున్నారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా బహుళ విధాల రవాణావ్యూహాలను అమలు పరచడం ద్వారా, నిరంతర అనుసంధాన కలిగించడం ప్రధాన ఉద్దేశం. మౌలిక సదుపాయాల విస్తరణ ద్వారా ఆత్మనిర్భర భారత్ను సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఇటువంటి ప్రాజెక్టులను దేశవ్యాప్తంగా చేపడుతోంది.
గత పదేళ్లలో మౌలిక సదుపాయాల వృద్ధి
గత పదేళ్ల కాలంలో భారత్లో మౌలిక సదుపాయాల వృద్ధి అద్భుతమైన రీతిలో కొనసాగిందనే చెప్పాలి. వీటివల్ల దేశంలో భౌతిక అనుసంధానత పెరగడంతో పాటు, తక్కువ ఖర్చు, పర్యావరణ హితమైన రీతిలో రవాణా సదుపాయాలను కల్పించడం జరుగుతోంది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రగతి, ప్రధానమంత్రి గతిశక్తి, నేషనల్ లాజిస్టిక్ పాలసీ, భారత్మాల, సాగరమాల మరియు ఉడాన్ వంటి ప్రాజెక్టులు దేశంలో అనుసంధానతను మరింతగా పెంచాయి. వీటిల్లో ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ను 2021, అక్టోబర్ 13న కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని ఆర్థిక జోన్లను బహుళ నమూనా మౌలికసదుపాయాల ద్వారా అనుసంధానత పెంచడం ప్రధాన లక్ష్యం. ఈ సమీకృత వేదిక కింద ఇప్పటివరకు రూ.100 లక్షల కోట్లను సమర్థవంతంగా వినియోగించగలిగారు. ఈ పథకం కింద రైల్వేలు, రోడ్లు, పోర్టులు, నీటి ప్రయాణమార్గాలను అభివృద్ధి చేస్తున్నారు.
రైల్వేల్లో ఇటీవలి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి చీనాబ్ వంతెన. ఇది ప్రపంచంలోనే అతి ఎతైౖన వంతెన. ఇక రెండది అంజిఖడ్ బ్రిడ్జి. ఇది మొట్టమొదటి రైల్వే కేబుల్ వంతెన. ఈ రెండిరటిని జూన్ నెలలో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. చీనాబ్ వంతెన ఎత్తు 359 మీటర్లు కాగా, దీనికోసం 1315 మీటర్ల పొడువున నిర్మించిన ఆర్క్ బ్రిడ్జిని ఉక్కుతో నిర్మించారు. ఇది పెనుగాలులను, పెద్ద విస్ఫోటాలను తట్టుకోగలదు. వీటి తర్వాత చె ప్పుకో దగింది కొత్త పంబన్ వంతెన. ఇది భారత్లో నిర్మించిన మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ కలిగిన సముద్ర రైలు వంతెన. ఇది రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలుపుతుంది. చెప్పు కోవాల్సిన మరో పెద్ద రైలు ప్రాజెక్టు కోసి రైల్ మహాసేతు. 2020, సెప్టెంబర్ 18న ప్రధాని న రేంద్రమోదీ దీన్ని ప్రారంభించారు. ఇది భారత్`నేపాల్ సరిహద్దులో అత్యంత కీలకమైన వంతెన!
వందేభారత్ రైళ్లు
ఇవి అత్యాధునిక సదుపాయాలతో కూడిన సెమీ హైస్పీడ్ రైళ్లు. ప్రస్తుతం ఇవి దేశంలోని 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 333 జిల్లాలను అనుసంధానిస్తున్నాయి. ప్రస్తుతం దే శంలో 68 వందేభారత్ ఎక్స్ప్రెస్లు (136 సర్వీసులు) నడుస్తున్నాయి. మొత్తం 400 వందేభారత్ ఎక్స్ప్రెస్లను తయారుచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇక నాన్`ఎసి కేటగిరీకి చెందిన అమృత్ భారత్ రైళ్ల నిర్మాణం ప్రస్తుతం చెన్నైలోని ఐ.సి.ఎఫ్.లో జరుగుతోంది. ప్రస్తుతం దేశంలో మూడు అమృత్భారత్ రైళ్లు (ఆరు సర్వీసులు) నడుస్తున్నాయి. నమోభారత్ ర్యాపిడ్ రైళ్లు తక్కువ దూరాల్లో వుండే నగరాల మధ్య నడుపుతారు. వీటినే ఇంటర్`సిటీ నెట్వర్క్ కింద పరిగణిస్తా రు. ఇవి కపుర్తలాలోని ఆర్సీఎఫ్లో తయారవుతున్నాయి. ప్రస్తుతం రెండు నమోభారత్ రైళ్లు (రెండు సర్వీసులు) నడుస్తున్నాయి. రాబోయే రెండు మూడు సంవత్సరాల కాలంలో 200 కొత్త వందేభారత్ ఎక్స్ప్రెస్లు, వంద ఆమృత్భారత్ రైళ్లు, 50 నమోభారత్ ర్యాపిడ్ రైళ్లు, 17500 జనరల్ నాన్`ఏసీ కోచ్లు దేశవాసులకు అద్బుతమైన ప్రయాణానుభవాన్ని ఇవ్వనున్నాయి.
ఇప్పటివరకు దేశంలో 98శాతం బ్రాడ్గేజ్ మార్గాల్లో ఎలక్ట్రిఫికేషన్ పూర్తయింది. రెండువేల రై ల్వే స్టేషన్లలో సోలార్ విద్యుత్ సదుపాయం కల్పించారు. రైల్వే స్టేషన్లు, ఇతర భవనాల్లో వంద శాతం ఎల్ఇడీ బల్బులను వాడుతున్నారు. ఇక కోచ్ల విషయానికి వస్తే 2014 నుంచి ఇప్పటివరకు 37వేల ఎల్.హెచ్.బి. కోచ్ల నిర్మాణం జరిగింది. ఇవి ప్రయాణికులకు మరింత భద్రత కల్పిస్తాయి. 2024`25 ఆర్థిక సంవత్సరంలో 7,134 కోచ్ల ఉత్పత్తి జరిగింది. గతంతో పోలిస్తే ఇది 9శాతం అధికం! రైళ్ల భద్రతకు ‘కవచ్’ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇది దేశీయంగా తయారైన వ్యవస్థ. రైలు ప్రమాదాలను అరికట్టడంతో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
దేశంలో వంద గతిశక్తి కార్గో టెర్మినల్స్ను ఏర్పాటు చేశారు. ఇది లాజిస్టిక్ ఖర్చులను తగ్గించడ మే కాకుండా, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్కు ఇది అనుకూలం. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశంలో 1300 స్టేషన్లను పునరభివృద్ధి చేస్తున్నారు. మొత్తం 68 రైల్వేస్టేషన్లలో ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో తక్కువ ధరకే మందులు అందుబాటులో వుంటాయి.