మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు రక్తదాన శిబిరం

వీణవంక,( కరీంనగర్ జిల్లా)

నేటి ధాత్రి:వీణవంక మండల కేంద్రంలో రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి గూటం హరి ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మానకొండూరు
యం. ఎల్. ఎ డాక్టర్ కవ్వం పల్లి సత్యనారాయణ గారు. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ గారు.

రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా వీణవంక మండల కేంద్రానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,
మనకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఒడిదల ప్రణవ్ బాబు గార్లు మాట్లాడుతూ స్పందన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వం పల్లి సత్యనారాయణ మాట్లాడుతూ
రాహుల్ గాంధీ జన్మదినం వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరం. కాబోయే ప్రధానమంత్రి యువ నాయకులు రాహుల్ గాంధీ పాదయాత్ర చేసి. పార్లమెంట్ ఎన్నికల్లో రెండవ స్థానం నిలబెట్టిన వ్యక్తి, మన రాహుల్ గాంధీ గారు. భారత్ జోడో, న్యాయ జోడో యాత్రల పేరట కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చిందని దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని కట్టడి చేసిన ఘనత రాహుల్ గాంధీ గారిది ఇలాంటి నాయకుడు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వీణవంక మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్, జిల్లా కార్యదర్శి గూటం హరి ప్రసాద్ రెడ్డి,, సీనియర్ rనాయకులు గంగాడి రాజీ రెడ్డి, మసాడి మాధవ రావు, చదువు జైపాల్ రెడ్డి,నల్ల కొండల్ రెడ్డి మాజీ సర్పంచ్ లు గంగాడు తిరుపతిరెడ్డి, ఎక్కడి రఘుపాల్ రెడ్డి, పంజాల సతీష్, పార్లపల్లి రమేష్, కర్ర తిరుపతిరెడ్డి, నాయకులు ఈదునూరి పైడి కుమార్, మాదాసి సునీల్ ఉపేందర్ రెడ్డి, మల్లారెడ్డి, సమ్మిరెడ్డి, ప్రసాద్, శ్రీపాల్ రెడ్డి, చొక్కా రావు, సంపత్, మధుకర్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్, మోహన్ రెడ్డి, రాజు, శీలం నరసింహారెడ్డి, జగన్ రెడ్డి, కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *