రామకృష్ణాపూర్ లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
దేశంలోని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని టిపిసిసి ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు లు అన్నారు. ఏఐసీసీ అగ్ర నాయకుడు,ఎంపీ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తా వద్ద గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యతను కల్పిస్తూ కాంగ్రెస్ కార్యకర్తను కాపాడుకుని రానున్న రోజుల్లో తిరుగులేని శక్తివంతమైన పార్టీగా కీర్తించడంలో అగ్రనేత రాహుల్ గాంధీ వ్యూహాలు ప్రణాళికలు అమలు చేయడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కళ సీనియర్ నాయకులు సమ్మయ్య, లాడెన్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కుర్మ సురేందర్, బత్తుల వేణు, నగేష్ రాజేష్ నాగులు ప్రేమ్ సాగర్ మహిళా నాయకురాళ్ళు పుష్ప, సునీత,శారద, దీప తదితరులు పాల్గొన్నారు.