ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిధిగా చిట్యాల ఎ ఎం సి వైస్ చైర్మన్ మహ్మద్ రఫీ పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణి చేశారు.అనంతరం రఫీ మాట్లాడుతూ. దేశ వ్యాప్తంగా ప్రతి గుండెను హత్తుకునేలా చేపట్టిన జూడో యాత్రతో ప్రజల కష్టాలను దగ్గరుండి చూసిన రాహుల్ గాంధీ ప్రతి పక్షనేతగా పేద ప్రజలకు న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తూ. దేశ ప్రజల అభ్యున్నతికై అనుక్షణం పరితపించే మృధుస్వభావి రాహుల్ గాంధీ అని. అలాంటి మహా నాయకునికి మొగుళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈవేడుకల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కళ్లపెల్లి రాజు, నడిగోటి రాము,ఏలేటి శివారెడ్డి, ఆకుతోట కుమార్, నీల రాజు, మంగళపల్లి శ్రీనివాస్, చంద్రబోస్, నాయకులు పాల్గొన్నారు.