ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య
జెఇఇ అడ్వాన్స్డ్ మైన్స్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం
కేసముద్రం/ నేటి ధాత్రి
ప్రభుత్వ కళాశాలల్లో నిష్ణాతులైన అధ్యాపకులతో నాణ్యమైన విద్య అందుతున్నదని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ అరిగకూటి శ్రీనివాస రెడ్డి, ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ ఖాదిర్ షరీఫ్ లు అన్నారు. జెఇఇ అడ్వాన్స్డ్ మైన్స్ లో రాష్ట్ర స్థాయిలో 1446 ర్యాంక్ సాధించిన బానోత్ సోమన్న, డైట్ సెట్ లో ప్రతిభ కనబరిచిన పరమేశ్వరి ని ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో ఉచిత పాఠ్యపుస్తకాలు అందించడంతో పాటు విద్యార్థులకు స్కాలర్షిప్సౌకర్యం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా చదువవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీను, కవిరాజు, రఘురాం, నాగేశ్వరరావు, శ్రీనివాస్, సుధాకర్, మహేందర్, రామ్మూర్తి, బాబు, యాకన్న, సతీష్, అనిల్ కుమార్, సుభాష్ అధ్యాపకేతర బృందం సైదా, ప్రదీప్, లక్ష్మణ్, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.