భారత ఆర్థిక సంస్కరణలలో విప్లవత్మక మార్పులు తీసుకొచ్చిన పివి.

Congress Party. Congress Party.

భారత ఆర్థిక సంస్కరణలలో విప్లవత్మక మార్పులు తీసుకొచ్చిన పివి

 

నడికూడ నేటిధాత్రి:

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మరియు ఉపాధ్యాయ బృందం పి వి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ
పాములపర్తి వేంకట నరసింహారావు భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశాడనీ ఈయన బహుభాషావేత్త, రచయిత,ఈ పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు,ఒకే ఒక్క తెలుగువారని,భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి అని,అదే సమయంలో దేశ లౌకిక విధానమునకు సంబంధించిన బాబ్రీ మసీదు కూల్చివేత కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నపుడు జరిగిందనీ, 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పి.వి., ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రి గానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడనీ,భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం ఆయన గొప్ప పరిపాలన దక్షతకు నిదర్శనం అని అన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ అని కూడా అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచరాజు కుమార్, మేకల సత్యపాల్, అంగన్వాడీ టీచర్స్ బీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!