Puthalapattu JanaSena Leaders Meet CM Chandrababu Naidu
ముఖ్యమంత్రిని కలిసిన పూతలపట్టు జనసేన నాయకులు….
పూతలపట్టు(నేటి ధాత్రి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు
నారా చంద్రబాబు నాయుడు
మూడు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన సందర్భంగా,కుప్పం విచ్చేసిన ముఖ్యమంత్రి ని ఆయన
నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం జనసేన నాయకులు. జనసేన నాయకులను చూడగానే ఎంతో ఆత్మీయంగా పలకరించి పూతలపట్టు నియోజకవర్గ విషయాలను,అక్కడి పరిస్థితులను,అభివృద్ధి స్థితిగతులను,పలు అంశాల గురించి అడిగి తెలుసుకుని,భవిష్యత్తులో ఏమైనా అవసరం ఉంటే తమను సంప్రదించాలని తెలియజేసిన ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తమతో చాలా ఆత్మీయంగా మాట్లాడి, నియోజకవర్గంలో పలు విషయాల గురించి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు
కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన పూతలపట్టు జనసేన నాయకులు..
ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య యాదమరి మండల అధ్యక్షులు కుమార్ ఐరాల మండల అధ్యక్షులు కక్కే పురుషోత్తం జిల్లా నాయకులు ఎం.మహేష్ స్వేరో ఐరాల మండల ఉపాధ్యక్షులు వాసు రాయల్ యాదమరి మండల సీనియర్ నాయకులు ప్రభాకర్ ఐరాల కిషోర్ కుమార్
తదితరులు పాల్గొన్నారు..
