భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం మున్సిపాలిటీ. మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి జి రఘు గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛత హె సేవా కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని ఆనందకాన్ని ప్రభుత్వ పాఠశాల నందు స్వచ్ఛత ప్రతిజ్ఞ విద్యార్థుల తో చేపించడం జరిగినది ఈ ప్రతిజ్ఞ యొక్క ముఖ్య ఉద్దేశం మన చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చెత్తను డస్ట్ బిన్ లో తడి , పొడి చెత్తగా పేరు చేసి వేయడం మరియు ఆ చెత్త డబ్బాను రోజు ఇంటి ముందుకు వచ్చే స్వచ్ఛ ఆటో కి అందించవలసిందిగా మరియు బహిరంగ మలమూత్ర విసర్జనము నిషేధించడం ప్రతిజ్ఞ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెడ్మాస్టర్ షకీలా, ప్రైమరీ స్కూల్ ప్హెడ్మాస్టర్ కవిత,స్కూల్ టీచర్స్ ,మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్లు వీరభద్ర చారి, అశోక్ ,సానిటరీ జవాన్లు రవి , శ్రీహరి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.