కొనుగోలు చేసిన వడ్లను తరలించాలి
కలెక్టర్అధికారులకు ఆదేశాలు
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు
సోమవారం ఉదయం కలెక్టర్ తన ఛాంబర్ లో వ్యవసాయ కో ఆపరేటివ్ సివిల్ సప్లై మార్కెటింగ్ అధికారులతో ధాన్యం తరలింపు పై సమీక్ష నిర్వహిం చారు .ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వడ్లు ఎన్ని,రైస్ మిల్లులకు, గోదాములకు తరలించింది ఎన్ని, ఇంకా కొనుగోలు కేంద్రాల్లో లోడింగ్ కావాల్సినవి ఎన్ని అని అన్ని వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వర్షాలు పడుతున్నందున రైతులు ఇబ్బందులు కు గురి కాకుండా లారీ రవాణా కాంట్రాక్టర్లు ఎప్పటికప్పుడు లారీలు పంపించాలని అలసత్వం చేసే కాంట్రాక్టర్ల అనుమతి రద్దు చేసి ఇతరులకు ఇవ్వాలని అదనపు కలెక్టర్ రెవెన్యూను కలెక్టర్ ఆదేశించారు
గోపాల్ పేట పెద్ద మందడి పొల్కేపాడు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తరలించేందుకు సిద్ధంగా ఉందని వడ్లు తరలించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు . ప్రతి రైస్ మిల్లుకు, గోదాముకు సన్న వడ్లు, లావు వడ్లు 60 40 నిష్పత్తిలో పంపించాలని సూచించారు ప్రతి వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, జిల్లా కో ఆపరేటివ్ అధికారి బి.రాణి, సివిల్ సప్లై అధికారులు తదితరులు పాల్గొన్నారు.