ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి.

Hassle Hassle

ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..

నర్సంపేట నేటిధాత్రి:

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద నిర్వాహకులను ఆదేశించారు.వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని మ్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, పెద్దమ్మ గడ్డ, మనుబోతుల గడ్డ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తనిఖీ చేశారు.రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని తెలిపారు.ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు వర్షంపడే అవకాశం ఉన్నప్పుడు టార్పాలిన్లు కప్పి ఉంచాలని కలెక్టర్ సూచించారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.ధాన్యం రవాణాకు సరిపడా వాహనాలు మరియు హమాలీలు సమకూర్చుకోవాలని తెలిపారు.గోనె సంచుల కొరత లేకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు.కలెక్టర్ వెంట డిఆర్డిఓ కౌసల్య దేవి,జిల్లా సహకార అధికారి నీరజ,పౌర సరఫరాల జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా పౌర సరఫరాల ఆధికారి కిష్టయ్య,మహిళా సంఘాల ప్రతినిధులు రైతులు తదితరులు  ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!