Collector Urges Public to Utilize Prajavani
ప్రజావాణి సద్వినియోగం చేసుకోవాలి
సమస్యల పరిష్కారానికి ప్రజావాణి
మండల కేంద్రాల్లోనే దరఖాస్తులు స్వీకరణ..
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..
నిజాంపేట: నేటి ధాత్రి
ప్రజా సమస్యల నివృత్తి కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. నిజాంపేట మండలంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని నేరుగా బాధితుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజల దూర భారాలను దృష్టిలో ఉంచుకొని మండలాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు వివిధ సమస్యల నిమిత్తం ప్రజలు ప్రజావాణి కార్యక్రమన్నీ సద్వినియోగం చేసుకున్నట్లు తెలిపారు. సమస్యల సంబంధించి ఆయా శాఖల అధికారులకు దరఖాస్తులు పంపించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజిరెడ్డి సంబంధిత అధికారులు ఉన్నారు
