పేద కుటుంబాలకు అండగా ప్రజా ప్రభుత్వం
సన్న బియ్యం పంపిణీ పేదలకు వరం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని
సన్నబియ్యం పంపిణీ నిరుపేదలకు వరంగల్ మారిందని
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన దారకొండ నాగరాజు నివాసంలో గ్రామానికి చెందిన నాయకులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ బడిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు