ప్రజా ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ప్రజా ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని,

ప్రభుత్వానికి విద్యా, వైద్య రంగాలను రెండు కళ్లుగా భావించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.

ఈరోజు శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇతర జిల్లా అధికారులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ మోడల్ స్కూల్ మరియు బీసీ వెల్ఫేర్ విద్యార్థులకు కలెక్టర్ తో కలిసి బ్లాంకెట్స్, బెడ్ షీట్స్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి విద్యా, వైద్య రంగాలను రెండు కళ్లుగా భావించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. చలి బాగా ఉందని విద్యార్థులు ఇబ్బంది పడుతూ చెప్పినట్లు తెలిపారు. అదేవిధంగా, చల్లని నీటితో స్నానం చేస్తే చర్మ వ్యాధులు వస్తున్నాయని విద్యార్థులు తెలిపారు. వారి సమస్యలను జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వేడి నీటి కొరకు గ్లీసర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో మెస్, డైట్ చార్జీలు పెంచలేదని, ఆ ఘనత ప్రజా ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాక్షించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుని ఉన్నత ఉద్యోగాలు పొందాలని సూచించారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఏకాగ్రతతో చదువుకుని ఉన్నతంగా స్థిరపడి తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, జిల్లా కు మంచి పేరు తీసుకురావాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!