Praja Palana Meeting Held in Mancherial
ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక
శ్రీరాంపూర్: నేటిధాత్రి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికకార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సురేఖమ్మ ఆదేశాల మేరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్ సంగ మల్లయ్య పల్లెలోని హనుమాన్ దేవాలయం సమీపంలో వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బండారి సుధాకర్, వార్డు ఆఫీసర్ శివతో కలిసి ఆయన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా సమస్యలన్నీ పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
