
Praja Palana Day in Murtuzapur
ముర్తుజపూర్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
సెప్టెంబర్ 17, బుధువారం రోజున న్యాల్కల్ మండలంలోని ముర్తుజాపూర్ గ్రామ పంచాయితీ, పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది.తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేయటం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్ 17న ఆవిష్కృతమైంది. రాచరిక పాలన అంతమై ప్రజాస్వామ్య ప్రస్థానం ప్రారంభమైంది. ఈ శుభ సందర్భంగా ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి నరేశ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు శ్రీకాత్ , గ్రామ నాయకులు, అజమ్ పటేల్, సిరాజ్ పటేల్, మోహన్ రెడ్డి, రమేశ్ పటేల్, సాల్మన్, దినకర్,ప్రశాంత్ మరియు పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.