
President Keesara Ramesh Reddy.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ముందుండేది పిఆర్టీయూ
పిఆర్టీయూ మరిపెడ మండల అధ్యక్షులు కీసర రమేష్ రెడ్డి
మరిపెడ నేటిధాత్రి.
పిఆర్టీయూలో సభ్యత్వమే ఒక మవరం అని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో అలుపెరుగని కృషి చేస్తున్న సంఘం పిఆర్టీయె అని సంఘం మండల అధ్యక్షులు కీసర రమేష్ రెడ్డి అన్నారు.పిఆర్టీయూ సభ్యత్వ నమోదు పక్షోత్సవాలలో భాగంగా మరిపెడ, గుండెపుడి తానంచర్ల,బరహాన్ పురం తాళ్ళఊకల్,గిరిపురం,బావోజిగూడెం,రాంపురం పాఠశాలలో సభ్యత్వ నమోదులో భాగంగా ఆయన మాట్లాడుతూ పిఆర్టీయూ సంఘం ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. ఉపాధ్యాయ బదులు పదోన్నతుల విషయంలో చేసిన సంఘం పిఆర్టీయూ సంఘం అని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ మండల ప్రధాన కార్యదర్శి లింగాల మహేష్ గౌడ్, రాష్ట్ర బాధ్యులు దోమల లింగయ్య, బాయగాని రాంమోహన్,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గండి కరుణాకర్,సరోజ,గుర్రం వెంకన్న,సంఘ బాధ్యులు పొడిశెట్టి యాదగిరి,శ్రీను,క్రిష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.