మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.

Financial Assistance Financial Assistance

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

చిట్యాల మండల కేంద్రానికి చెందిన అనుమ రాజు ఇటీవల కాలంలో అనారోగ్యంతో అకాల మరణం చెందారు.  విషయం తెలుసుకున్న 2005-06 పదవ తరగతి  బ్యాచ్ మిత్రులు తమవంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించి రూ.40,000 లను సేకరించిన నగదును మృతుని పిల్లల పేరు మీదుగా పోస్ట్ ఆఫీస్ లో జమ చేసి  జమ చేసిన ధ్రువపత్రాలను శుక్రవారం మృతుని దశదినకర్మ రోజు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ.. ఈ లోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటి లేదని అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాలుపంచుకునే ఆప్త మిత్రుడు దూరమవ్వడం చాలా బాధాకరమని, భౌతికంగా మా మధ్య లేకపోయినా అతని భావాలు మాపై చూపించిన ఆధారాభిమానాలు ఏనాటికి చెరగని స్మృతులుగా మా మధ్య మెదలాడుతూనే ఉంటాయని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మిత్రుడు రాజు కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.
     ఈ కార్యక్రమంలో చింతల మహేందర్, మురహరి భానుచందర్, ఉయ్యాల  రమేష్, కల్వచర్ల రాము, పాసిగంటి మహేందర్, ఏకు అశోక్, రాయిని శ్రీకాంత్, ఎండి సాజిత్, కమ్మగాని బాలకృష్ణ, శ్రీపతి రమేష్, నాగబాబు, తిరుపతి, క్రాంతి, రామచందర్, రవీందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!