ఆర్థిక సహాయం అందించిన ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్
నేటి ధాత్రి
ఇటీవల మరణించిన సంస్కృతం అధ్యాపకులు రవీందర్ కుటుంబానికి తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించడం జరిగింది .తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాస్ గౌడ్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఎం సతీష్ కుమార్, జె ఎస్ డబ్ల్యూ టీవీ సీనియర్ ఇంగ్లీష్ అధ్యాపకులు చిలువేరు శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్యాల యుగంధర్, చిర్ర వెంకట్, ఆర్ తిరుపతి ల ఆధ్వర్యంలో అధ్యాపకుల సహకారంతోహనంకొండ లో వారి నివాసానికి వెళ్లి 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి భార్యకు పిల్లలకి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల్లో పనిచేస్తూ ఇటీవల మరణించిన రవీందర్
మృతుని కుటుంబానికి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ద్వారా అన్ని విధాల ఆర్థిక సహాయాన్ని అందజేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ తరపున కోరడం జరిగింది. అదేవిధంగావారి పిల్లలకు చదువులకు వారి అవసరాలకు అయ్యే ఖర్చును ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ద్వారా అందించాలని డిమాండ్ చేయడం జరిగింది.