కుక్కలు,కోతుల బెడద నుండి ప్రజలను కాపాడండి
కాంటెస్టెడ్ ఎమ్మెల్యే బొచ్చు రాజు
పరకాల,నేటిధాత్రి
పట్టణంలో కుక్కలు,పందులు మరియు కోతుల బెడద రోజురోజుకు ఎక్కువవుతున్నదని పట్టణప్రజలు భయాందోళనకు గురవుతున్నారని కాంటెస్టెడ్ ఎంపీ బొచ్చు రాజు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు పనిచేసుకునే కొయ్యడ బిక్షపతి అనే వ్యక్తి వెనకాల నుండి వచ్చి వీధి కుక్క కరవటం జరిగిందని అంతేకాకుండ గుడికి వెళ్ళన భక్తుడిపై కోతి దాడి చేయటం జరిగిందని ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు.
