ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు..
రామకృష్ణాపూర్ నేటిధాత్రి:
ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కంబగోని సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్ లు అన్నారు. తెలంగాణ సిద్ధాంత కర్త, జయశంకర్ వర్ధంతి పురస్కరించుకొని రామకృష్ణాపూర్ పట్టణంలోని జయశంకర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ శ్రేణులు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన నష్టాలను, కష్టాలను.. తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ప్రజలకు వివరిస్తూ, ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని జయశంకర్ సార్ రగిలించారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా, ధ్యాసగా వారు నడిపిన పోరాటం, జీవితం మహోన్నతమైనదని, మీరు కలలుగన్న తెలంగాణ ప్రగతి సాక్షిగా మీకివే మా నివాళులు అని అన్నారు.తెలంగాణ ప్రాంతం ఆంధ్ర పాలకుల వల్ల అణగారిపోయి అభివృద్ధికి నోచుకోకుండా ఉందని వారి నుండి విముక్తి కోసం తెలంగాణ ఉద్యమ కర్త కెసిఆర్తో వెన్నంటి ఉండి తెలంగాణ ప్రాంతంలో మన నీళ్లు,మన నిధులు,మన ఉద్యోగాలు కావాలని, కోరుకునే వ్యక్తులలో మొదటి వ్యక్తి జయశంకర్ అని అన్నారు. ఆశయాలను బంగారు తెలంగాణ కోసం నిత్యం తపించే గొప్ప ఆదర్శవాది అని అన్నారు. వారి మరణం తెలంగాణ ప్రాంత ప్రజలకు తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు రెవెల్లి ఓదెలు, అనిల్ రావు, పోగుల మల్లయ్య, జాడి శ్రీనివాస్, జిలకర మహేష్, సీనియర్ నాయకులు అలుగుల సత్యం, జక్కన బోయిన కుమార్, రామిడి లక్ష్మి కాంత్, గోనె రాజేందర్, ఖలీం,చంద్రకిరణ్, కుర్మ దినేష్ తదితరులు పాల్గొన్నారు.