కే.యు ఆంగ్ల విభాగంలో పీహెచ్డి సూపర్వైజర్ గా ప్రొఫెసర్.

Professor Mallam Naveen Professor Mallam Naveen

కే.యు ఆంగ్ల విభాగంలో పీహెచ్డి సూపర్వైజర్ గా ప్రొఫెసర్ నవీన్ ఎంపిక

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

కాకతీయ యూనివర్సిటీ ఆంగ్ల విభాగంలో పీహెచ్డి సూపర్వైజర్ గా నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ ఎంపికయ్యారు.
ప్రొఫెసర్ మల్లం నవీన్ ను కాకతీయ యూనివర్సిటీ ఆంగ్ల విభాగంలో పీహెచ్డీ గైడ్ షిప్ ను అందించింది.కాగా
వీరు ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) సభ్యులుగా కొనసాగుతున్నారు.
కాకతీయ యూనివర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ కే. ప్రతాప రెడ్డి,రిజిస్ట్రార్, ఆర్ట్స్ డీన్ ఈ సందర్భంగా అభినందించారు.తెలంగాణ ప్రభుత్వం నుండి స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డును,ఏల్టాయి నుండి నేషనల్ లెవెల్ బెస్ట్ టీచర్ అప్రిసియేషన్ అందుకుని,వివిధ నేషనల్, ఇంటర్నేషనల్ సెమినార్లలో దాదాపు 59 పరిశోధన పత్రాలను, వివిధ జర్నల్ మరియు పుస్తకాలలో దాదాపు 30 వ్యాసాలను ఇప్పటివరకు ఆయన సంపర్పించారు.ఈ సందర్భంగా జరిపిన సమావేశంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, వివిధ కళాశాలల నుంచి అధ్యాపకులు ప్రొఫెసర్ మల్లం నవీన్ ను ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా పరిశోధనలు చేసే విద్యార్థులకు మెంటారుగా ,సూపర్వైజర్ గా తన యొక్క విద్యార్థులు పరిశోధన గ్రంథం సమర్పించడంలో తగు సలహాలు సూచనలు ఇస్తూ పరిశోధక విద్యార్థుల యొక్క అత్యున్నత డిగ్రీ( పీహెచ్డీ పట్టా) పొందడంలో పారదర్శకంగా, నిజాయితీగా నాణ్యమైన పరిశోధనలు రావడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ గొప్ప అవకాశం కల్పించిన కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కే. ప్రతాప రెడ్డి, రిజిస్టర్, ఆర్ట్స్ డీన్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కు ఉన్నత గౌరవం దక్కడంతో కళాశాల యొక్క కీర్తి మరో మైలురాయి దాటినట్టు అధ్యాపక మిత్రులు సిబ్బంది, విద్యార్థులు సంతోషాన్ని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!