సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలి

హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలి

సంక్షేమ హాస్టల్ లో హెల్త్ క్యాంపులునిర్వహించాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్

కరీంనగర్, నేటిధాత్రి:

సమస్యలకు నిలయంగా సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయని సంక్షేమ హాస్టల్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ డిమాండ్ చేశారు. ఈసందర్భంగా మచ్చ రమేష్ మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. అధిక వర్షాలు కురుస్తున్నందున జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలలో విషజ్వరాలు, సీజనల్ వ్యాదులు సోకకుండా చర్యలు తీసుకోవాలని, మురుగు నీటి కారణంగా దోమలు కుట్టడం వలన డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా లాంటి వ్యాధులను అరికట్టడంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, వసతి గృహాలలో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి విద్యార్దులకు సరైన వైద్యం అందించాలని పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులు మెస్ చార్జీలు పెంచాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!