వామ్మో కుక్కల స్వైర్య వివారం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:

 గట్టుప్పల మండల పరిధిలోని వెల్మకన్నె గ్రామంలో కుక్కల స్వైర్య వివారం చేస్తున్నాయి . దారి వెంట నడవాలంటే ప్రజలుకుక్కల భయానికి బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. ఏ గ్రామానికి వెళ్లిన గుంపులు గుంపులుగా కుక్కలు దర్శనమిస్తున్నాయి. అధికారులకుచెప్పినవినిపించుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మండల వ్యాప్తంగా పిచ్చికుక్కల భయానికి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే మా గ్రామంలో ఉన్న పిచ్చి కుక్కలను లేకుండా చేయాలని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.చిన్నపిల్లలు అయితేకుక్కల భయానికి అరచేతిలో ప్రాణాలు పెట్టుకునివెళ్తున్నారు.జనసంచారంఅధికంగా ఉండే ప్రాంతాల్లో కుక్కల సంచారం అధికమవడంతోప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో రోడ్డు మీద వెళ్లే వారిని బైకులపై వెళ్లే వారిని అకస్మాత్తుగా వచ్చికరిచేస్తున్నాయి. వీధి కుక్కల బారినపడి ఎంతోమందిఆస్పత్రుల పాలవుతున్నారు.మరి రాత్రుళ్లు అయితే మరి దారుణం ప్రతి వీధిలో పదుల సంఖ్యలో కుక్కలు వీధుల వెంట సంచరిస్తున్నాయి. ఏ వీధిలో చూసినా వీధి కుక్కలు స్వైర్య వివారం చేస్తున్నాయి. ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు స్పందించి కుక్కల బెడద లేకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!