
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బిజెపి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు పాపన్న జగదీశ్వర్ ఆధ్వర్యంలో ముక్తేశ్వర లాడ్జిలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ హామీలు ఇచ్చి ప్రజలను వెన్నుపోటు పొడవడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు దొందు దొందే ఈ రెండు పార్టీలను ప్రజలు ముఖ్యంగా నిరుద్యోగులు, ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యావంతులు విద్యార్థులు సమస్యల పట్టవు ఎన్నికల వచ్చినప్పుడు ఓట్లు వేయించుకునేందుకు ఆది చేస్తారు హామీలు ఇవ్వడం ప్రజలను మోసం చేయడం ఈ రెండు పార్టీల నైజం కావున వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల బిజెపి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు కన్నం జగదీశ్వర్ పాపన్న చల్ల నారాయణరెడ్డి శంకర్ నాయకులు పాల్గొన్నారు