ఎండ తీవ్రతకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

Congress

ఎండ తీవ్రతకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి *

మొగుళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు క్యాతరాజు రమేష్

నేటిధాత్రి మొగుళ్ళపల్లి :

 

మొగుళ్లపల్లి మండల ప్రజలకు మరియు, ,పరిసర ప్రాంతాల ప్రజలకు వేసవి ఎండల తీవ్రతలకు ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల ప్రజలు వడ దెబ్బకు గురయ్యే అవకాశం వుంది వడదెబ్బ సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు క్యాతరాజు రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఉపాధి హామీ పనులతో పాటు వ్యవసాయ పనుల నిమిత్తం కుళి పనులకు వెళుతున్న కూలీలు వడ దెబ్బ సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా వివరించామని చెప్పారు. వడ దెబ్బ నివారణకై ప్రజలు,కూలీలు అందరూ రోజుకి 10 గ్లాసుల కన్నా ఎక్కువ నీరు త్రాగాలన్నారు.బయటికి వెళ్లినప్పుడు గొడుగు,టోపీ, తలపాగ,తెల్లని కాటన్ దుస్తులు ధరించాలని సూచించామన్నారు. ఉదయం,సాయంత్రం ఎండ లేని సమయంలో పనులు చేసుకోవాలని,ఎండ వేడిమికి డి హైడ్రెషన్ కాకుండా ఉండడానికి ఓఆర్ఎస్ ద్రావణాన్ని త్రాగాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!