ఇండిపెండెంట్ చర్చిలో ప్రార్థనలు

నిజాంపేట, నేటి ధాత్రి

మండల కేంద్రంలోని ఇండిపెండెంట్ చర్చిలో పాస్టర్ కాంతి రాజు ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నుండి ప్రార్థనలు చేశారు. నస్కల్, తిప్పనగుల్ల ,కాసింపూర్ గ్రామాల నుండి ఏసుక్రీస్తు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రార్థనలో పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా పాస్టర్ కాంతి రాజు మాట్లాడుతూ యేసు క్రీస్తు దయామయుడు కరుణామయుడు అని సకల జీవుల యందు ప్రేమ గల దేవుడు అన్నారు. అదేవిధంగా ఏసుప్రభు భక్తులు కూడా సత్యమునే మాట్లాడాలని ఆయన యందు విశ్వాసం ఉంచువారు ధన్యులు అవుదురు గాక అన్నారు. ఒకరినొకరు ప్రేమతో ఆప్యాయతతో కలిసిమెలిసి జీవించాలన్నారు. యవ్వనస్తులు యువతి యువకులు భయభక్తులతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జోన, పాస్టర్ పౌలు, ఆశీర్వాదం, బిక్షపతి, చంద్రం, స్రవంతి, వినోద, రాజమణి, చంద్రకళ, స్వరూప, సరోజ, ఇందిరా, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!