Pranav Babu urges
తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండండి…
– ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రణవ్ సూచన
– ఐకెపి,ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు..
హుజురాబాద్, నేటి ధాత్రి:
రాష్ట్రానికి మొంథా తుఫాను ప్రభావం మరో రెండు రోజులు ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో,చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని దీని దృష్ట్యా హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని,ముఖ్యంగా ఇది వరి కోతల సమయం కాబట్టి పత్తి,వరి రైతులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్పే సూచనలను పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ మేరకు ధాన్యం కొనుగోలు విషయంలో త్వరితగతిన పూర్తి చేయాలని రైతులకు ఇబ్బంది కలగకుండా టార్ఫలిన్ కవర్లు అందించాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
