ట్రైన్ కు కృషి చేసిన మంత్రి పొన్నంకు ధన్యవాదాలుతెలిపిన ప్రణవ్.

Train Train

కరీంనగర్-తిరుపతి ట్రైన్ కు కృషి చేసిన మంత్రి పొన్నంకు ధన్యవాదాలుతెలిపిన ప్రణవ్
హుజురాబాద్ నేటిధాత్రి:

 

ఇక్కడి ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సుదూర ప్రాంతాలకు వెళ్ళే క్రమంలో ప్రజల సౌకర్యార్థం కరీంనగర్ నుండి తిరుపతికి వెళ్ళే ట్రైన్ సదుపాయాన్ని వారానికి రెండు సార్లు నడిపేలా అనేక మార్లు కేంద్రానికి విజ్ఞాపన చేసి,కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు,కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవి,స్ధానిక ఎంపీ బండి సంజయ్ కు హుజురాబాద్ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్..గతంలో ఎంపీగా ఉన్న సమయంలో పొన్నం జమ్మికుంట రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి చేశారని,కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జమ్మికుంట రైల్వే స్టేషన్ ను మోడల్ రైల్వే స్టేషన్ గా మార్చి ఆధునీకరణ చేశారని అన్నారు.ప్రస్తుతం ఎంపీగా ఉన్న బండి సంజయ్ రైల్వే స్టేషన్ ల అభివృద్ధికి తగిన నిధులు తీసుకురావాలని మరిన్ని ట్రైన్ సర్వీసులు జమ్మికుంట లో ఆగేలా చూడాలని,అలాగే నిత్యం ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్న ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నీ త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!