శక్తిగల సువార్త స్వస్థత పండుగలు: భక్తితో ఆధ్యాత్మిక ఉత్సాహం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో ఎంయుఎం మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఎం. అనిల్ కుమార్ నిర్వహించిన ‘శక్తిగల సువార్త స్వస్థత పండుగలు’ రెండు రోజుల పాటు భక్తి, ఆధ్యాత్మిక ఉత్సాహంతో జరిగాయి. ఈ ప్రత్యేక సభలకు గ్రామంతో పాటు సమీప ప్రాంతాల నుంచి క్రైస్తవ భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రవచకుడు రెవ. గెరాల్డ్ జెర్రీ రౌస్, యేసు క్రీస్తు బోధించిన ప్రేమ, శాంతి, సేవా తత్వాన్ని వివరించి విశ్వాసులను ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం కీర్తనలు, ఆరాధన గీతాలు, ప్రత్యేక ప్రార్థనలతో భక్తులను ఆకట్టుకుంది. ఫాస్టర్లు ప్రసాద్, వినయ్, సామిల్, కోర్నేల్ తదితరులు ప్రార్థనలు
