జహీరాబాద్లో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని 132 కేవీ సబ్స్టేషన్లో మరమ్మతుల కారణంగా రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పట్టణం మొత్తం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ తెలిపారు.మన్నపూర్ ఫీడర్ పరిధిలో గల మొగుడంపల్లి మండలం మొత్తం గ్రామాలకు మరియు గోవింద్పూర్, మధులైతుండా, అర్జున్ నాయక్ తాండ గ్రామాలలో కరెంటు ఉండదు, ఈ సమయంలో వినియోగదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుని విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు.
