32వ రోజుకు చేరుకున్న పవర్ ప్లాంట్ కార్మికుల నిరాహార దీక్ష

మంచిర్యాల నేటిదాత్రి

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన పవర్ ప్లాంట్ ముందు కార్మికుల హక్కుల సాధన కోసం, భారతీయ మజ్దూర్ సంఘ్ (బి.ఎం.ఎస్) ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కొనసాగుతోంది. అందులో భాగంగానే నేటితో 32 వ రోజుకు చేరిన నిరాహార దీక్ష, అదేవిధంగా బి.ఎం.ఎస్. జిల్లా కార్యదర్శి మద్దూరి రాజు యాదవ్ మాట్లాడుతూ శాలివాహన పవర్ ప్లాంట్ మూసివేసి గత 15 నెలలు కావస్తున్న, కార్మిక చట్టం ప్రకారం కార్మికులకు క్లోజింగ్ బెనిఫిట్స్ చెల్లించకుండా పవర్ ప్లాంట్ యాజమాని మల్కా కొమరయ్య గారు మొండిగా వ్యవహరిస్తున్నారు, ఇప్పటికైనా కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటం పై స్పందించి కార్మిక చట్టం ప్రకారం రావలసిన బెనిఫిట్స్ చెల్లించాలని కోరుచున్నాము. కార్మిక సంఘం అధ్యక్షులు కుంటాల శంకర్ మాట్లాడుతూ ప్లాంట్ నిర్మాణం కోసం భూనిర్వాసితుల దగ్గర అతి తక్కువ ధరకు భూములు తీసుకుని,శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని రాసిచ్చారు. ప్రస్తుతం భూ నిర్వాసితులు ఉద్యోగాలు పోయి అటు భూములు కోల్పోయి రోడ్డున పడ్డ పరిస్థితి నెలకొంది. కార్మికుల హక్కుల సాధన కోసం గత 32 రోజులుగా శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు,రాజకీయ నాయకులు గానీ పవర్ ప్లాంట్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువచ్చి తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయవలసిందిగా కోరుచున్నాము.లేనిపక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం.ఈ యొక్క కార్యక్రమంలో బి.ఎమ్.ఎస్. జిల్లా కార్యదర్శి మద్దూరి రాజు యాదవ్, పవర్ ప్లాంట్ కార్మిక సంఘం అధ్యక్షులు కుంటాల శంకర్, కార్యదర్శి ఎన్.సత్యనారాయణ,ఉపాధ్యక్షులు సగ్గుర్తి ఆనందరావు, పెంట సత్యం,ఆర్ తిరుపతి, ఆసరి రాజయ్య,ఇసారపు శంకర్, గెల్లు ఎల్లయ్య, మానెం శ్రీశైలం,మరియు సమస్త కార్మికులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *