గుంతలు పూర్తిగా పూడ్చని వైనం ప్రమాదాలకు నిలయం…

BSNL tower BSNL tower

గుంతలు పూర్తిగా పూడ్చని వైనం -ప్రమాదాలకు నిలయం…

నేటి ధాత్రి -మహబూబాబాద్ :-

 

 

బయ్యారం మండల పరిధి నామాలపాడు నుంచి కాచన పల్లి రహదారి మార్గం పక్కన కేబుల్ కోసం తవ్విన గుంటలు పూర్తిగా పూడ్చకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారాయి.

గతంలో బిఎస్ఎన్ఎల్ టవర్ కేబుల్ లైన్ వేయడం కోసం యంత్ర సాధనాలతో తీసిన గుంతలు పుడ్చకపోవడతో రహదారి ప్రయాణికులకు, పశువులకు ప్రమాదంగా మారి సతమతమవుతున్నాయని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.

అసంపూర్తిగా ఉన్న గుంటలలో ద్విచక్ర వాహనాలు, వాహనదారులు,మూగ జంతువులు పడి ప్రమాదాలకు గురి అవుతున్నాయి.

ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నాయి.

BSNL tower
BSNL tower

 

గుత్తేదారు గుంతలు పూడ్చకపోవడం ద్వారానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, జిల్లా అధికారులు చోరువచూపి ప్రమాదాల బారిన పడకుండా కేబుల్ కోసం వేసిన గుంతలను పూర్తి స్థాయిలో పూడ్చుతారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!