భద్రాచలం నేటి ధాత్రి
విధ్యుత్ ఉన్నతాదికారులకు ఖాళీ స్థానాలు కనిపించడం లేదా ?
ఏజెన్సీ ప్రాంతం అని విస్మరిస్తున్నారా?
కుల వివక్ష కారణంగానే దుమ్మగూడెం,చర్ల మండలాలకు ఉద్యోగులను నియమించడం లేదా?
ప్రభుత్వం ఆర్టికల్ 21 ను ఉళ్లంఘిస్తోంది.
– బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్ చార్జ్ తడికల శివకుమార్.
చర్ల సెక్షన్ (సబ్ డివిజన్ ) స్థాయిలో ఉన్న విధ్యుత్ అధికారు లు క్రింది స్థాయి ఉద్యోగులతో చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్ చార్జ్ తడికల శివకుమార్ అన్నారు.బహుజన్ సమాజ్ పార్టీ కార్యకమాల్లో భాగంగా దుమ్మగూడెం మండలంలో పర్యటణలో బాగంగా ఆయన దృష్టికి వచ్చిన విధ్యుత్ అధికారుల కొరత గురించి ఆయన స్పందిస్తూ చర్ల సెక్షన్ ( సబ్ డివిజన్) పరిధిలోని చర్ల,దుమ్మగూడెం మండలాలో విధ్యుత్ ఉద్యోగుల పోస్ట్ లు ఖాళీ గా ఉన్నా పై స్థాయి అధికారులు,ప్రభుత్వం పూరించక పోవడం ఏజెన్సీ ఆదివాసీ ప్రజల పట్ల వివక్షే అని అన్నారు. ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంభవించే గోదావరి పరివాహక,అటవీ ప్రాంత చర్ల సబ్ డివిజన్ లో క్వాలిఫైడ్ విధ్యుత్ ఉద్యోగుల అవసరం ఎక్కువగా ఉన్నా ప్రభుత్వం దృష్టి సారించక పోవడం దురదృష్టకరం అన్నారు.సాదారణ బదిలీలలో ఏజెన్సీకి తొలి ప్రాధాన్యత అని నిభందనలలో ఉన్నప్పటీ ఉన్నతాధికారులు పాటించక పోవడం విధినిర్వహనలో వారి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందని అన్నారు. చర్ల సబ్స్టేషన్ సత్యనారాయణపురం సబ్ స్టేషన్ ఆర్టిజెన్సీగా పనిచేస్తున్నటువంటి పని విధానంలో నలుగురు ఉండవలసినటువంటి వీరిలో ఇద్దరు మాత్రమే పని చేయడం జరుగుతుంది అలాగే దుమ్మగూడెం మండలం పర్ణశాల సబ్ స్టేషన్ దుమ్ముగూడెం సబ్స్టేషన్ ఆర్లగూడెం సబ్స్టేషన్ కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది అంత మాత్రమే కాదు రెగ్యులర్ ఎంప్లాయిస్ లో ఇదే కొరత ఏర్పడింది పర్ణశాల సబ్స్టేషన్ పరిధిలో జానియర్ లైన్ ఇన్స్పెక్టర్,లైన్ మెన్,అసిస్టెంట్ లైన్ మెన్ ,తో పాటు ఔట్ సోర్సింగ్ ద్వారా అన్ మ్యాండ్ ఉద్యోగి నియామక అవకాశం ఉన్నా ..నియమించుకోకుండా ఒకరిద్దరు ఉద్యోగుల సహాయంతోనే పనులన్నీ చేయిస్తున్నారని ఎక్కువ పరిమితి కలిగి ఉన్నటువంటి ప్రాంతం ఉన్నటువంటి చర్ల దుమ్ముగూడెం మండలాల్లో తక్కువ సిబ్బంది ఉండటం చేత జరుగుతున్న ప్రమాదాలను వారిని బాధ్యులుగా చేసి మానసికమైన ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు తద్వారా ఆర్థికంగా శారీరకంగా మానసికంగా కృంగిపోతున్నారు ఇది భారత రాజ్యాంగం లో ఆర్టికల్ 21 ఉల్లంఘనేనని అన్నారు.ఆర్టికల్ 21 వెట్టి చాకిరీని వ్యతిరేకిస్తుందని రాజ్యాంగ ఉల్లంఘన కు పాల్పడుతున్న ప్రభుత్వం,ప్రభుత్వ అధికారులు తగిన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు.చర్ల సబ్ డివిజన్లో సెక్షన్ లో ఉండవలసిన సబ్ ఇంజనీర్స్ పోస్టులు ఖాళీ ఉండటం చాలా దురదృష్టకరం సబ్ డివిజన్లోని సెక్షన్ లోని అధికారులు లేకపోవడం వినియోగదారుల సమస్యల పరిష్కారంలో అంతరాయం జరుగుతుందని తెలియజేశారు.అంతేకాకుండా ఏదో ఉడతా భక్తిగా అధికారులు వారి యొక్క అధికారాన్ని ప్రదర్శిస్తున్నారని ఒకరిద్దరు అధికారులతోనే పనులు ప్రమాధకరంగా జరుగుతున్నాయని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఖాళీలను పూరించాలని లేని ఎడల బిఎస్పీ ప్రజా ఉధ్యమాలను నిర్మించి కార్యాలయాల ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.ఈ కార్యక్రమం లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP)నియోజక వర్గ అధ్యక్షుడు కొండా. చరణ్, ప్రధాన కార్యదర్శి సామల.ప్రవీణ్, కోశాధికారి కొప్పుల. నారాయణ, బియస్పి నాయకులు కొండా. ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు