అంబర్ గుట్కా ప్యాకెట్స్ స్వాదీనం..వ్యక్తి అరెస్టు.

# గుట్కా,గంజాయి,పీడీఎస్ బియ్యం దందా చేస్తే కఠిన చర్యలు.పీడీ యాక్ట్ నమోదు..
# దుగ్గొండి ఎస్సై వెంకటేశ్వర్లు హెచ్చరికలు జారీ..

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :

దుగ్గొండి మండలంలోని స్వామిరావుపల్లి గ్రామంలో రాజమౌళి కిరాణం షాపుపై పోలీసు దాడి చేశారు.న్
భారీగా అంబర్,గుట్కా ప్యాకెట్లను స్వాదీనం చేసుకొని యజమానిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దుగ్గొండి ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏరియాలో పాన్ షాపులు, కిరాణం షాపులు తనిఖీ చేయగా స్వామిరావుపల్లి గ్రామంలో రాజమౌళి కిరాణం షాపులో సుమారు రూ.17600 విలువ గల గుట్కా,అంబర్ ప్యాకెట్లు లభ్యమయ్యాయని తెలిపారు.ఆ గుట్కలను సీజ్ చేసి కిరాణం షాపు యజమాని దాసరి రాజమౌళిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
దుగ్గొండి మండలంలో గుట్కా గంజాయి అమ్మిన అలాగే పిడిఎస్ బియ్యం వ్యాపారం జరిపిన వారిపై చట్టారీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుట్కా,గంజాయి, పిడిఎస్ అక్రమ వ్యాపారం చేస్తే రెండు రకాల కేసులతో పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!