నియోజకవర్గంలోని ప్రతి సమస్యపై అవగాహన కలిగి,సమస్యల పరిష్కారానికి శ్రమించే నాయకుడు పోరిక బలరాం నాయక్

భద్రాచలం నేటి ధాత్రి

నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజా సేవ చేయాలనే దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారు

మాజీ గ్రంథాలజీ చైర్మన్ భోగాల శ్రీనివాసరెడ్డి

ఈరోజు మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుతూ భద్రాచలంలో సూపర్ బజార్ సెంటర్ నందు మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలతో మమేకమవుతూ కేంద్రంలో ఇండియా కూటమి అధికారాన్ని చేపడితే ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ఐదు న్యాయాలు, అందులో దేశ ప్రజలందరికీ ఉపయోగకరంగా పొందుపరిచినటువంటి అంశాలను ప్రజలకు వివరించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం కారణము ప్రజలేనని, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా నిర్ణయాలకు అనుగుణంగా పరిపాలన అందిస్తుందని.

కాంగ్రెస్ పార్టీ ప్రజాధరణ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెండుగా ఉండి పార్లమెంట్ అభ్యర్థులుగా మహబూబాబాద్ పార్లమెంట్ అభివృద్ధిగా బర్రిలో ఉన్నటువంటి పోరిక బలరాం నాయక్ ని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని ఆయన మాట్లాడారు.

ఈ ఎన్నికల ప్రచారంలో
కాంగ్రెస్ నాయకులు అన్నెం రామిరెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకులు తుమ్మల రాణి,కట్ట కళ్యాణి, రూపా దేవి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *