పేద ప్రజలకు డబల్ బెడ్ రూములు ఇవ్వాలి

భద్రాచలం దళిత మహానాడు పుట్టు రవి

భద్రాచలం నేటి ధాత్రి

ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ పేద ప్రజలకు డబల్ బెడ్ రూములు వెంటనే ఇవ్వాలని స్థానిక అంబేద్కర్ సెంటర్లో జరిగిన సమావేశంలో పుట్టు రవి అన్నారు అయన మాట్లడుతూ ఇంకా అంటరానితనం పేదరికం కొనసాగుతుందని రాష్ట్రంలో పేదవాడు ఉండడానికి రెండు సెంట్లు జాగా లేక ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పేదలకు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అద్దె ఇళ్లల్లో పేద ప్రజలు మగ్గుతున్నారని వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా గాని పేదవాడి సొంత ఇంటి కలలు నెరవేరలేదని ఇకనైనా ప్రభుత్వం స్పందించి వారికి డబుల్ బెడ్ రూములు కేటాయించాలని డిమాండ్ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!