
Heavy Rains.
మత్తడి పోస్తున్న చెరువులు, కుంటలు
నిండుకుండలా మారిన చెరువులు కుంటలు
శాయంపేట నేటిధాత్రి:
ఇటీవల కురిసిన ఏకధాటి వర్షాలకు శాయంపేట మండ లంలోని పలు గ్రామాలలోని చెరువులకు జలకలను తెచ్చిపె ట్టాయి. వర్షాలు పడడంతో భారీగా వరదరావడంతో చెరువులు నుండి మత్తడి పోస్తూ నూతన శోభను సంతరించుకున్నాయి. పలు గ్రామాల్లోని కుంటలు జలకల ఉట్టిపడుతుంది. చాలా రోజుల తర్వాత వర్షం పడటంతో చెరు వులన్నీ నీళ్లతో కళకళ లాడు తున్నాయి. ఇక చేరువు కింద వరి సాగు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వరిసాగు చేస్తూ, మిగతా గ్రామాల్లో చెరువులు నిండు కుండలవుతూ ఖరీఫ్ పంట సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు.