మెట్‌పల్లి పట్టణంలో కలుషిత నీటి సమస్య..

మెట్‌పల్లి పట్టణంలో కలుషిత నీటి సమస్య
-అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలవిజ్ఞప్తి
ఫిబ్రవరి17 మెట్ పల్లి నేటిదాత్రి

 

మెట్ పల్లి పట్టణంలోని 14వ వార్డులో మిషన్ భగీరథ నల్ల ద్వారా వచ్చే తాగునీరు కలుషితంగా వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కిరాయికి ఉంటున్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
ఈ విషయంపై గృహిణి ఎశమేని నాగవ్వ మాట్లాడుతూ:
మేము కిరాయికి ఉంటున్నాం. ఈ ఇంట్లో బోర్ లేదు. నల్ల నీరే మా కుటుంబానికి ఆదారం. కానీ ఇలా మురికి, కలుషిత నీరు వస్తే త్రాగడానికి, స్నానానికి, వంటకు, బట్టలు ఉతకడానికి ఎలా ఉపయోగించాలి?” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆమె మాట్లాడుతూ, చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాలకు ఈ పరిస్థితి మరింత ప్రమాదకరమని తెలిపారు. కలుషిత నీరు వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎశమేని నాగవ్వ తో పాటు స్థానిక ప్రజలుఅధికారులకు విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి
నీటి నాణ్యతను పరీక్షించాలని
పైప్‌లైన్లను పరిశీలించాలని
శుద్ధమైన తాగునీరు సరఫరా చేయాలని
డిమాండ్ చేస్తున్నారు.
పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version