ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు

మండల వైద్యాధికారి డాక్టర్ పుష్పలత

హుజూర్ నగర్,నేటిధాత్రి.

పిల్లల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా మార్చి 3వ తేదీ నుంచి మూడు రోజులపాటు పల్స్‌ పోలియో నిర్వహిస్తున్నట్లు మండల వైద్యాధికారి డాక్టర్ పుష్పలత తెలిపారు.
పల్స్‌పోలియోపై శుక్రవారం హుజూర్నగర్ లో నిర్వహించిన వైద్య సిబ్బంది ,ఆశ మరియు అంగన్వాడి అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో మండలం లోని ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. మొదటిరోజునే 90శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని, గృహ సందర్శనలో మిగతా పిల్లలను గుర్తించి తదుపరి రెండు రోజుల్లో పోలియో చుక్కలు వేయాలన్నారు. పోలియో కేంద్రాలతోపాటు , బస్టాండ్లలో అపార్ట్మెంట్ నిర్మాణాలు జరిగే చోట, సంచార జాతుల నివాస స్థలాల్లో, ఇటుక బట్టీల వద్ద పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పద్మ, రూట్ సూపర్వైజర్లు నూర్జహాన్ బేగం, సీహెచ్ .పద్మ, గజగంటి ప్రభాకర్, ఇందిరాల రామకృష్ణ వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!