నేటి ధాత్రి
కాటారం లో గృహ నిర్మాణాలకు ఇసుక కొరత ఉన్నందున ప్రస్తుత పరిస్థితుల దృష్యా ట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు నాయిని శ్రీనివాస్ తెలిపారు. శనివారం ట్రాక్టర్ అసోషియేషన్ లో ట్రాక్టర్ ఓనర్ల తో సమావేశం నాయిని శ్రీనివాస్ మాట్లాడుతూ
విలాసాగర్ మానేరువాగు, లోకల్ వాగుల నుండి ఇసుక సరఫరా చేయడం ఇబ్బందిగా ఉన్న నేపథ్యం లో గ్రామ ప్రజలకు ఇసుక సరఫరా చేయలేక పోయాను. కావునా ప్రజల ఇబ్బందులే నా సమస్యగా భావించి ట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు నాయిని శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాటారం గ్రామములో నెలకొన్న ఇసుక కొరతకు ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు