పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.

#ఎస్సై నైనాల నగేష్.

నల్లబెల్లి, నేటి ధాత్రి: విద్యార్థిని విద్యార్థులు పోలీసుల పట్ల ఉన్న భయాన్ని తొలగించి వారు ఎలాంటి సమస్యలు ఎదురైనా ధైర్యంగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు ఇచ్చే మనోధైర్యాన్ని ప్రతి ఒక్కరు కలిగిఉండాలని ఎస్సైనైనాల నగేష్ పేర్కొన్నారు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన భేటీ బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళా సాధికారత కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థినులకు పలు చట్టాలపై అవగాహన కల్పిస్తూ, మొబైల్ ఫోన్ వినియోగం పట్ల జాగ్రత్తల గురించి వివరిస్తూ ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే డయల్ 100కు ఫోన్ చేసిన వెంటనే పోలీస్ సిబ్బంది అందుబాటులోఉంటారని విద్యార్థులు ఎలాంటి భయభ్రాంతులకు ఆందోళన చెందకుండా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం మిషన్ కోఆర్డినేటర్ పావని, జెండర్ స్పెషలిస్ట్ హర్షిత, పోలీస్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!