
Police raid on cockfighting camp
కోడిపందాల స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
జైపూర్ ఎస్సై జాడి శ్రీధర్
జైపూర్,నేటి ధాత్రి:
కోడి పందాల స్థావరం పై జైపూర్ పోలీసులు బుధవారం మెరుపు దాడి నిర్వహించినట్లు తెలిపారు.జైపూర్ మండలం దుబ్బ పల్లి గ్రామ శివారులో కొందరు వ్యక్తులు కోడిపందాలు నిర్వహిస్తున్నారని నమ్మదగిన సమాచారం రావడంతో జైపూర్ ఎస్సై శ్రీధర్ తన సిబ్బందితో కలిసి కోడిపందాల స్థావరంపై దాడి చేసి అక్కడ ఉన్నవారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.వివరాల్లోకి వెళితే సిసిసి నస్పూర్ కు చెందిన గడ్డం సతీష్,లక్షేటి పేట కోమ్మగూడెంకు చెందిన లశెట్టి సురేష్,శ్రీరాంపూర్ తీగల పహాడ్ కు చెందిన చెట్టుకురి రాజేష్ అదుపులోకి తీసుకొని విచారించగా అక్కడినుండి పోలీసులను చూసి కొంతమంది పారిపోయినట్లు వారు తెలిపారు.అక్కడి నుండి పారిపోయిన వ్యక్తులు వివరాలు ఇందారం గ్రామానికి చెందిన కూరగాయల శ్రీకాంత్,యతి రాజు,వంశీ,మహేష్,వైద్య గణేష్ టేకుమట్ల గ్రామానికి చెందిన గోనె శరత్,గోదావరిఖనికి చెందిన పాకి సందీప్,నస్పూర్ కు చెందిన రంగు సాయి, అరుణక్కనగర్ శ్రీరాంపూర్ చెందిన ఉదయ్ పారిపోయినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన నేరస్తుల వద్ద నుండి ఒక కోడి,31 కోడి కత్తులు,3840 రూపాయల నగదు,మూడు సెల్ ఫోన్లు,ఏడు వాహనాలు స్వాధీనపరచుకొని జైపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించి వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు.