
Police Raid Gambling Den in Zaheerabad
పేకాట స్థావరంపై పోలీసుల దాడి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణ పోలీసులు సోమవారం రాత్రి జహీరాబాద్ పట్టణంలోని పేకాట స్థావరంపై దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 15800/- నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, మరియు 52 పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు, జహీరాబాద్ పట్టణంలోని మస్తాన్ కాలనీలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు తెలిసింది. దీంతో జహీరాబాద్ టౌన్ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె. వినయ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి దాడి చేశారు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట రిత్య చర్య తీసకుంటారని తెలిపారు.