పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఘనం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో సోమవారం రాత్రి స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది 65వ నంబర్ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి, పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సైదా, సీఐ శివలింగం, ఎస్ఐ వినయ్ కుమార్, కాశీనాథ్, రాజేందర్ రెడ్డి, నరేష్, సుజీత్ తదితరులు పాల్గొన్నారు. ఈ వారోత్సవాలు పోలీసుల సేవలను, త్యాగాలను స్మరించుకోవడానికి ఉద్దేశించబడ్డాయి.
