విత్తనాల దుకాణాల్లో పోలీసుల తనిఖీ.

Police Police

విత్తనాల దుకాణాల్లో పోలీసుల తనిఖీ

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా)నేటిధాత్రి:

 

గుండాల పోలీసు స్టేషన్ సిఐ రవీందర్, ఎస్సై సైదా రహూఫ్ ఆధ్వర్యములో వ్యవసాయ అధికారితో కలసి గుండాల లో ఉన్న సీడ్స్,ఫర్టిలైజర్ షాపులపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ సీడ్స్, ఫర్టిలైజర్స్ షాప్ యజమానులు నిబంధనలకు లోబడి వ్యాపారాలు చేసుకోవాలని, నకిలీ, కల్తీ విత్తనాలు,ఎరువులు సరఫరా చేసి రైతులను మోసం చేస్తే కఠినమైన చర్యలు తప్పవు అని అన్నారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించాలని వ్యవసాయాన్ని బలోపేతం చేయాలని అన్నారు. కల్తీ విత్తనాలు విక్రయించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు అనుమతి లేని విత్తన విక్రయాదారులవద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న విత్తన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయలని, తప్పనిసరిగా కొనుగులుకు సంభందించి రశీదు అడిగి తీసుకోవాలని తెలిపారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వెంటనే సంబంధిత వ్యవసాయ అధికారులకు, పోలీస్ స్టేషన్ కు తెలపలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!