Police Intensify Checks Across District
జిల్లావ్యాప్తంగా పోలీసుల తనిఖీలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు, జిల్లావ్యాప్తంగా పోలీసులు చెక్ పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహించారు. జహీరాబాద్, నారాయణఖేడ్ అంతరాష్ట్ర చెక్ పోస్టుల వద్ద వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి, అనుమానాస్పద వాహనాలను పూర్తిగా తనిఖీ చేశారు. మద్యం, గంజాయి, పేలుడు పదార్థాలు, అక్రమ ఆయుధాలు, ఇతర నిషేధిత వస్తువుల రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
