గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన విధంగా తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఎస్పి వినీత్ జి ఐ పి ఎస్ ఆదేశాల మేరకు డిఎస్పి రమణమూర్తి సూచనల మేరకు గుండాల మండల కేంద్రంలో పోలీసులు వాహన తనిఖీలు చేయుటకు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. పోలీసులు వచ్చే పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఏమైనా అనుమానితంగా అక్రమ డబ్బు రవాణా చేస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గుండాల సీఐ ఎల్ రవీందర్ మాట్లాడుతూ మన వ్యక్తిగత అవసరం నిమిత్తం ధనాన్ని ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి తీసుకువెళ్లాలంటే ఎలక్షన్ కోడ్ నిబంధనలు అమలులో ఉన్నందున సంబంధిత ఆధారాలు ఉంచుకోవాలని తెలియజేశారు, ఎవరు కూడా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి శాంతి భద్రతలకు భంగం కలిగించే పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుండాల పోలీస్ సిబ్బంది మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.