Three Held for Public Drinking in Zahirabad
బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని పాస్తాపూర్ గ్రామ శివార్లలో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు జహీరాబాద్ పట్టణ ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు. బహిరంగ ప్రదేశంలో మద్యం తాగి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
