PM Modi Condoles the Demise of Khaleda Zia
ఖలీదా జియా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం..
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి మంగళవారం ఉదయం ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఆమె మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్ (Bangladesh)మాజీ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అధినేత్రి బేగం ఖలీదా జియా (80)(Khaleda Zia) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో (Health Issue) బాధపడుతున్నారు. ఈ రోజు (మంగళవారం) తెల్లవారుజామున ఢాకాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) సంతాపం (condolences)వ్యక్తం చేశారు. భారతదేశం – బంగ్లాదేశ్ సంబంధాలను బలోపేతం చేయడంతో ఆమె పాత్రను ప్రశంసించారు.
